ముఖం తెల్లగా కావాలి అంటే ఏం చేయాలి ?

0

కొంత మంది నల్లగా ,మరికొంతమంది, తెల్లగా ఉంటారు. నా;తెల్లగా ఉండే వారికి ఎలాంటి బాధ ఉండదు, నల్లగా ఉండేవారికే బాధ తెల్లెగా గా ఉండే వారిని చూసి నెనెఉ అల ఉంటె బాగుంటది కదా అని అనుకొంటారు. ఎలా నల్లగా ఉండే వారి కోసం చిట్కాలు.సాధార‌ణంగా కొంద‌రికి శ‌రీరం మొత్తం తెల్లగా  ఉంటుంది ముఖం మాత్రం న‌ల్ల‌గా ఉంటుంది.ఇలాంటి వారు చాలా బాధ ప‌డుతుంటారు.

ముఖం న‌లుపును త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఏవేవో క్రీములు వాడ‌తారు.త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ వేల‌కు వేలు త‌గ‌లేస్తుంటారు.కానీ, కొన్ని కొన్ని ఇంటి చిట్కాల‌ను ఫాలో అయ్యితే  చాలా సుల‌భంగా ముఖాన్ని తెల్లగ, కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.

మీ కోసం కొన్ని చిట్కాలు 

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కీర‌దోస నుంచి తీసుకుని ర‌సం, ఎగ్ వైట్‌, మొక్క జొన్న పిండి మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని దాదాపు ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం తెల్ల‌గా మారియు ఫ్రెష్‌గా మారుతుంది.

అలాగే ముఖాన్ని తెల్ల‌గా మార్చ‌డంలో ఓట్స్ కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ఒక బౌల్‌లో ఓట్స్ పొడి, ఆలివ్ ఆయిల్ మ‌రియు తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మానికి ముఖానికి కావాల‌నుకుంటే మెడ‌కు కూడా అప్లే చేసి అర గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే ముఖం తెల్ల‌గా మ‌రియు కాంతివంతంగా త‌యార‌వుతుంది.

ఇక ఒక బౌల్‌లో పాల పొడి, పెరుగు మ‌రియు స్వ‌చ్ఛ‌మైన రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి పావు గంట లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా ముఖం తెల్ల‌గా, మృదువుగా మారుతుంది.

కలబంద మరియు నిమ్మరసం: కలబంద గుజ్జును కొద్దిపాటి నిమ్మరసాన్ని తీసుకొని పేస్టులా చేసుకుని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని

నీటితో ముఖం కడుక్కోవాలి. జిడ్డు, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి. పాలు మరియు పసుపు పాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. ఎలా చేయడం వలన ముఖం తెల్లగా మారుతుంది.

శెనగపిండి మరియు నిమ్మరసం : మూడు స్పూన్ల శనగపిండి, నిమ్మరసం తీసుకుని మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయుట వలన మెరిసే ముఖం మన సొంతం అవుతుంది.

బాదం మరియు పాలు : నానబెట్టిన బాదం పలుకులను పచ్చిపాలలో కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజు గంట సేపు ఉంచుకోవాలి. రాత్రి పూట ముఖానికి అప్లై చేసి  పడుకుంటే మంచిది. ముఖం యొక్క కాంతిని పెంచుతుంది.

నిమ్మరసం మరియు తులసి ఆకులు : నిమ్మరసం, తులసి ఆకుల రసాన్ని సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇవి చర్మానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

పాలు మరియు పసుపు : పాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. ఈ పాలను ఫ్రిజ్ లో ఉంచాలి. నానబెట్టిన దూది పింజలను రోజూ ఒకటి తీసుకుని కమిలిపోయిన చర్మంపైన రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి