నారా లోకేష్ జగన్ ని టార్కేట్ చేసారు

0

ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని  మరోసారి టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. గ్రామ వాలంటీర్ల పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఆయన చమత్కరించారు.రివర్స్ టెండరింగ్ లో సీఎం జగన్  వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారని,నారా లోకేష్ ప్రస్తావించారు. గ్రామ వాలంటీర్లు కూడా జగన్ ని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో దోపిడీ మొదలు చేశారని ఘాటు విమర్శలు చేశారు.

అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని వైయస్ జగన్ మరిచిపోయారని లోకేష్ విమర్శించారు. అయితే రెండు నెలలు కాకముందే పింఛనుదారులు నుంచి వసూళ్లకు  పాల్పడుతున్నారని, దసరా మామూలు పేరుతో దోపిడీ చేస్తున్నారని లోకేష్ విమర్శించారు.పింఛను మూడు వేలకు పెంచుతామని చెప్పికేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారని ఆయన తెలిపారు.అందులో కూడా  మామూళ్ల కింద250 రూపాయలు కట్టాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు.

అయితే  పెన్షన్ దారుల నుంచి దసరా మామూలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలో నలుగురు  గ్రామ వాలంటీర్ల పై ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే.పింఛన్ దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో, వారిని వెంటనే విధుల నుంచి తొలగించారు.ఇలాంటి సంఘటనలు తమ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడా గాని  జరగలేదని ఆయన అన్నారు.

ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి  వస్తుందని లోకేష్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ హయాంలో పేద ప్రజలకు సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్, పండుగలకు చంద్రన్న కానుకలు పంపిణీ  చేసే వారన్నారు.జగన్ ప్రభుత్వంలో పండుగలకు ప్రజలే శిస్తు కట్టాల్సిన పరిస్థితి దాపురించిందని లోకేష్ గారు ఘాటుగా విమర్శించారు.